Thursday, April 25, 2024

విద్యార్థులతో కలిసి రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యే అరూరి..

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఐనవోలులోని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులతో కలిసి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి, ఎమ్మెల్యే అరూరి రమేష్ కి ఆప్యాయంగా రాఖీలు కట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నా చెల్లల్లు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక ఈ రక్షా బంధన్ అని తెలిపారు. అనంతరం 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement