Thursday, April 25, 2024

స‌మీకృత క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల నిర్మాణ‌ ప‌నుల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి స‌మీక్ష‌

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరోజు వరంగల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయం నిర్మాణం వేగవంతం చేయడంపై హనుమకొండ ఆర్ అండ్ బి కార్యాలయంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష చేశారు. ఈ సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్, కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ శ్రీవాత్సవ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమషనర్ ప్రావీణ్య, కూడా ప్రాజెక్ట్ ఆఫీసర్ అజిత్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement