Saturday, April 20, 2024

ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డిని ప్ర‌శంసించిన.. మంత్రి ఎర్ర‌బెల్లి

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి రానున్న మూడు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి,జిల్లా ఇంఛార్జి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన గత సంవత్సరం పంట నష్టపోయిన రైతులకు ప్రత్యేక జీవో ద్వారా పంట నష్ట పరిహారం అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసించారు.పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి వలుడు అని,రైతుల కోసం ప్రత్యేక జీవోను కేసీఆర్ ను ఒప్పించి తీసుకొచ్చి మరి రాష్ట్రంలో మొట్టమొదటి సరిగా పంట నష్ట పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు.నియోజక వర్గ అభివృద్ధి కోసం పెద్ది చేస్తున్న కృషిని వివరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,వ్యవసాయ శాఖ అధికారులు,హార్టికల్చర్ అధికారులు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement