Friday, April 26, 2024

క్రీడాకారులకు మంత్రి ఎర్ర‌బెల్లి అభినంద‌న

పర్వతగిరి : షూటింగ్ బాల్ క్రీడలో తెలంగాణ రాష్ట్రం, పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు నుంచి ఏషియన్ ఛాంపియన్ షిప్ కు ఎంపికైన బొల్లు పవన్, మంగళంపల్లి మధు, దొనికే జాహ్నవి, మందుల ఉమలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అండ్ గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. ఈరోజు ఉదయం పర్వతగిరి మంత్రి నివాసంలో స్థానిక జెడ్పీటీసీ శ్రీనివాస్, షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెడుపల్లి అయిలయ్య ఆధ్వర్యంలో మంత్రి దయాకర్ రావు ను కలిశారు.

ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు ఢిల్లీలో జరిగే ఏషియన్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ నుంచి ఈ క్రీడాకారులు పాల్గొననున్నారని మంత్రికి తెలిపారు. పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగే సౌత్ జోన్ పోటీల్లో విజేతలుగా నిలిచి, ఇపుడు ఏషియన్ ఛాంపియన్షిప్ కు ఎంపికయ్యారని వివరించారు. వీరికి కావాల్సిన వసతులు ఎర్రబెల్లి ట్రస్టు నుంచి కల్పిస్తున్నట్లు చెప్పారు. మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఏషియన్ ఛాంపియన్షిప్ లో విజేతలుగా నిలిచి తెలంగాణ రాష్ట్రం, పాలకుర్తి పేరు నిలబెట్టాలని మంత్రి ఆకాంక్షించారు. వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement