Tuesday, April 23, 2024

వరద బాధితులను పరామర్శించి.. ఓదార్చిన మంత్రి ఎర్రబెల్లి

ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తున్నారు. ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న, ముంపు ప్రాంతాలు, గోదావరి నది ఉధృతిని మంత్రి పరిశీలిస్తున్నారు. వరద నీటిలో నడుస్తూ, బాధితుల వద్దకు చేరుకున్న మంత్రి .. బాధితులతో మాట్లాడి వారిని ఓదారుస్తున్నారు. వరద సహాయక, పునరావాస చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో వరద పరిస్థితులను మంత్రి సమీక్షించనున్నారు. మంత్రి వెంట ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, పలువురు ప్రజా ప్రతినిధులు, ములుగు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, పలువురు అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement