Saturday, April 20, 2024

Breaking: వరంగల్ కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

వరంగల్ కలెక్టరేట్ లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ ఎదుట పెట్రోల్ పోసుకొని పత్తి మిల్లు యజమాని రఘురాం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పత్తి మిల్లు నడవాలంటే లంచం డిమాండ్ చేస్తున్నారంటూ రఘురాం ఆరోపించాడు. ఇది వరకే రూ.45వేలు లంచం ఇచ్చానని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన మిల్లుకు పత్తి కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ ఆవేదన చెందాడు. రఘురాం ఆత్మహత్యాయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement