Thursday, March 28, 2024

షార్ట్ సర్యూట్ తో లారీ దగ్ధం.. రూ.12 లక్షల ఆస్తి నష్టం..(Video)

మరిపెడ : ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ తీగలు తాకి షార్ట్ సర్క్యూట్ అయి జిప్సం లారీ దగ్ధమైంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని కాకతీయ కళాతోరణం వద్ద జాతీయ రహదారి 563 పై బుధవారం జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఆంద్రప్రదేశ్ రాష్టం విశాఖపట్నం నుంచి మరిపెడకు జిప్సం లోడ్ తో వచ్చిన లారీ మరిపెడ మునిసిపల్ కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ షాపులో సగం లోడు దించారు. అనంతరం మరో షాపు వద్ద అన్ లోడ్ చేసేందుకు వెళ్లాలి. ఈ క్రమంలో పట్టణంలో లారీ తిప్పేందుకు వీలు కాక పోవటంతో ఖమ్మం రోడ్ లోని కాకతీయ కళాతోరణం వద్ద లారీని తిప్పేందుకు రోడ్డు దించారు. ఈ క్రమంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తాకి షార్ట్ సర్క్యూట్ అయి టైర్లు అంటుకున్నాయి. క్రమంలో డిజిల్ ట్యాంకుకు మంటలు అంటుకుని పేలటంతో లారీ, జిప్సం లోడుకు మంటలు పూర్తిగా అంటుకున్నాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయటంతో వారు సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 లక్షల విలువ చేసే ౩౦౦బస్తాల జిప్సం, లారీ మండలల్లో కాలిపోవటంతో రూ.10 లక్షలు ఆస్తినష్టం వాటిల్లినట్లు డ్రైవర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement