Wednesday, April 24, 2024

తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా.. దొంగతనాలు

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వివిధ దొంగతనాల కేసులలో పలువురు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన జింక నాగరాజు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ జైలుకి కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు. గేట్ కు తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని కొత్తకొత్త ప్రదేశాల్లో దొంగతనాలు చేసినట్లు తెలిపారు. నాగరాజు బుధ‌వారం రాత్రి అయ్యప్ప దేవాలయం వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులకు తారస పడగా, తమదైన శైలిలో విచారించగా అతని వద్ద నుండి 33.7 తులాల బంగారాన్ని, 115 గ్రాముల వెండిని, ఒక స్కూటీను రికవరీ చేసినట్లు తెలిపారు. దొంగతనం చేసిన బంగారాన్ని మిత్రులైన నాగుల ప్రవీణ్, కట్ట రాజు, ఉల్లందుల ప్రశాంత్, వల్లంపట్ల పరమేష్ తో కలిసి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. నాగరాజుపై నర్సంపేటలో 7 కేసులు, గీసుకొండ పోలీస్ స్టేషన్ లో 1 కేసు ఉన్నట్లు తెలిపారు. నాగరాజుతో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తలిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్ లో పట్టుకున్న బంగారం విలువ 17.5 లక్షలు, వెండి 69 వేలు సుమారుగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సీఐ పులి రమేష్ గౌడ్, ఎస్సైలు బొజ్జ రవీందర్, అంగోత్ సురేష్ లతో పాటు సిబ్బందిని డీసీపీ వెంకటలక్ష్మి,ఏసిపి సంపత్ రావు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement