Tuesday, April 23, 2024

అక్రమ వెంచర్లకు చెక్ పెట్టాలి : అదనపు కలెక్టర్

ములుగు గ్రామపంచాయతీ పరిధిలో అక్రమ వెంచర్లకు చెక్ పెట్టాలని, అక్రమ కట్టడాలను నిలిపివేయాలని, లేఅవుట్ పర్మిషన్ తప్పనిసరి అని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ములుగు గ్రామం సర్పంచ్ వార్డు సభ్యులతో డి పి ఓ ఆర్ డి ఓ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ… ములుగు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుమార్ లేఅవుట్ పర్మిషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఇటీవల అక్రమ వెంచర్లపై కంప్లీట్ వచ్చాయన్నారు. లే అవుట్ పర్మిషన్ లేకుండా నూతన ఇండ్లకు నిర్మాణం ఎలా చేస్తున్నారని పర్మిషన్ ఎలా ఇస్తున్నారని అధికారులు అడిగారు. వార్డ్ సభ్యులతో గ్రామ సర్పంచ్ కార్యదర్శి ఫీల్డ్ వెరిఫికేషన్ వెళ్లి రెవిన్యూ సిబ్బందితో సర్వే రిపోర్ట్ సమర్పించాలన్నారు. గ్రామపంచాయతీ పాలకమండలి గ్రామసభ తీర్మానం ప్రకారం అక్రమ కన్ స్ట్ర‌క్షన్స్ జరగకుండా చూసుకోవాలన్నారు. ప్రతి వార్డులో వార్డు సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ములుగు జంగాలపల్లి మల్లంపల్లి ఏరియాలో విపరీతమైన అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని, పర్మిషన్ లేకుండా ఎలా జరుగుతున్నాయని, సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలన్నారు. లే అవుట్ అనుమతి చేసుకోకుండా అక్రమ కట్టడాలు జరుగుతుంటే నిర్లక్ష్యం తగదని సూచించారు.ప్రతి గ్రామ సభలో తీర్మానం జరిగిన ప్రతి మినిట్స్ రిపోర్టు త‌న దగ్గరికి రావాలన్నారు. కన్ స్ట్ర‌క్షన్ జరుగుతున్న భూమి రెవిన్యూ అసైన్డ్ వాటి వివరాలు, దస్తావేజులు పరిశీలించాలన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే భవిష్యత్తులో పురపాలక సంస్థ ఏర్పాటుకు ఎలా సిఫారసు చేస్తారని అన్నారు. లేఅవుట్ డెవలపర్స్ వస్తే వార్డు సభ్యులకు కనీస అవ్వగాహణ ఉండాలి.. పంచాయతీ సెక్రెటరీ లెటర్ రాసి భూములకు సంబంధించిన దస్తావేజులు పరిశీలించి పర్మిషన్ లకు సంబంధించిన వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే 2019 నుండి వెలిసిన వెంచర్ల యొక్క వివరాలు లే అవుట్ పర్మిషన్ భవన నిర్మాణాలకు పర్మిషన్ సరైన దస్తావేజులు పరిశీలించిన తర్వాత ఇవ్వాలని గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు. ప్రతి వార్డు సభ్యుడికి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడానికి హక్కు ఉందని 2019 పంచాయతీ చట్టం ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. అలాగే ప‌లు స‌మ‌స్య‌ల‌పై అధికారుల‌ను అడిగి తెలుసుకొని, వారికి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సమావేశంలో డిఆర్ఓ కె రమాదేవి, డి పి ఓ వెంకయ్య, డి ఎల్ పి ఓ దేవరాజ్, ములుగు గ్రామ సర్పంచ్ బి నిర్మల, తాసిల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో శ్రీనివాస్, ఏం పి ఓ. హనుమంతు, గ్రామ సెక్రెటరీ కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement