Sunday, March 17, 2024

కేసీఆర్ పర్యటనలో స్థానిక నాయకులకు చుక్కెదురు..

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి వడగండ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న క్రమంలో స్థానిక నాయకులకు చుక్కెదురైంది. మండల నాయకులు సుకీనే రాజేశ్వర్ రావు, కాట్ల భద్రయ్యకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కొన్ని విషయాలను అప్పగించగా వారు పోలీసులతో సమన్వయం చేసుకునే విషయంలో విఫలం అయ్యారు. తద్వారా పలువురు నాయకులను పోలీసులు అనుమతించని పరిస్థితి. మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ మూరల మోహన్ రెడ్డి, మచ్చిక నర్సయ్య లతో పాటు పలువురు పోలీసులు అనుమతి లేక ఇబ్బంది పడ్డ వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement