Wednesday, April 24, 2024

పిండి పట్టించుకునేందుకు వెళ్లి.. తిరిగిరాని లోకానికి…

భూపాలపల్లి (ప్రభన్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పండుగపూట విషాదం నెలకొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా పిండి పట్టించుకునేందుకు వెళ్లిన మహిళ తిరిగిరాని లోకాలకు వెళ్ళింది. జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామానికి చెందిన మాచర్ల కవిత (36) పిండివంటలు చేసుకునేందుకు శుక్రవారం స్థానికంగా ఉన్న గిర్ని వద్దకు వెళ్లింది.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె చీర కొంగు పిండి గిర్నీ పట్టే (మోటార్ బెల్ట్ ) పై పడింది. దీంతో క్షణం లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో వేములపల్లి గ్రామంలో పండుగ పూట విషాదం నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement