Friday, April 19, 2024

ఎమ్మెల్యే రసమయి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు

మానకొండూర్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చింది. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ సమక్షంలో ఈరోజు ఉదయం క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. బీఎస్పీ పార్టీ మానకొండూర్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌చార్జి సంగుపట్ల మల్లేశంతో పాటు సుమారు 100 మంది ముఖ్య బాధ్యులు, కన్వీనర్లు గులాబీ గూటికి చేరగా ఎమ్మెల్యే రసమయి వారికి కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దీంతో మానకొండూర్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. ఈ సంధర్బంగా సంగుపట్ల మల్లేశం మాట్లాడుతూ.. తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. గడిచిన 8 ఏళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందిన ఘనత కేవలం కేసీఆర్ కే దక్కిందన్నారు. కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ ద్వారానే దేశం ఎంతో పురోగతి సాధిస్తుందనే విశ్వాసంతో పాటు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులమై బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని మల్లేశం వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement