Friday, March 15, 2024

గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని వల్లభ్ నగర్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూష‌న్ సొసైటీలో సుమారు 32 మంది విద్యార్థులకు ఆహారం వికటించి అస్వస్థతకు గుర‌య్యారు. వెంట‌నే విద్యార్థుల‌ను పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత మూడు రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలతో బాధపడుతున్నట్టు గమనించిన సిబ్బంది విద్యార్ధులను కొద్దిసేపటి క్రితం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బందిని వివరణ కోరగా సాధారణ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement