Thursday, April 18, 2024

అంగ‌న్వాడి విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌..

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని స్థానిక అంగన్వాడీ పాఠశాలకు అదే తండాకు చెందిన విద్యార్థిని విద్యార్థులు రోజు వారి మాదిరిగానే పాఠశాలకు వెళ్లారు. అదే పాఠశాలలో ఏమైందో ఏమో కానీ భూక్యా సురేష్, మానసల కుమారుడు జశ్వంత్ పాఠశాలలోనే స్పృహ తప్పి పడిపోయాడు. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హన్మకొండకు తరలించగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వాంకుడోత్ రమేష్, రాధికల పిల్లలు శాన్వి , జగదీష్ చికిత్స అనంతరం వీరు క్షేమంగా ఉన్నారు. నిన్న అంగన్వాడీ పాఠశాలకు వెళ్ళాక మధ్యాహ్నం భోజనం అనంతరం ఈ పిల్లలు ఆడుకుంటూ అదే పాఠశాల సమీపంలో ఉన్న పంట క్షేత్రాల్లో ఉన్న క్రిమి సంహారక (పురుగు మందుల) డబ్బాలు రుచి చూసినట్లు కీలక సమాచారం. విధుల్లో ఉండాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంతో ఉండటంతోనే ఈ దారుణం జరిగింది అంటూ తల్లి తండ్రులు అంగన్వాడి టీచర్ అంగన్వాడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement