Friday, March 29, 2024

నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: సీపీఎం

హనుమకొండ: ఇండ్లులేని నిరుపేదలకు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి రాజుల రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ గుండ్ల సింగారం ఇందిరమ్మ కాలనీలో సీపీఎం ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించి, ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయడం జరిగింది. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదని, నగరంలో యేండ్ల తరబడి నివసిస్తున్న ప్రజలు ఇంటి కిరాయి కట్టలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుంటున్నార‌న్నారు. నిరుపేదలకు ఇంటి స్థలము ఇవ్వమంటే కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న ప్రజలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పద్మ, అశోక్, ఎల్లయ్య, చందు,రమేష్,కుమార్,రాజు, లతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement