Saturday, April 20, 2024

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి జోరుగా చేరిక‌లు

పరకాల : బీఆర్‌ఎస్ పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు, నాయకులు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో హనుమకొండలోని వారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ కోసం ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్‌లోకి వచ్చిన వారికి పార్టీ అన్ని విధాలా అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో యువ‌త‌కు పెద్ద‌పీట వేస్తామ‌న్నారు. యువ‌కులు ఉరిమే ఉత్సాహంతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాల‌ని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారాని అన్నారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. బొజ్జం శ్రీకాంత్, యాట చీరంజీవి, బొజ్జం వంశీ, బొజ్జం రాజశేఖర్, సంఘం ఐలయ్య, శానబోయిన బిక్షపతి, యాటకల్లా కుమారస్వామి, సూరా సన్నీ, బండి చందు, శానబోయిన రాజేష్ పార్టీలో చేశారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్యనాయకులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement