Thursday, March 28, 2024

వడగండ్ల వాన.. ధ్వంసమైన ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

ఖానాపూర్ మండలంలో నిన్నరాత్రి కురిసిన భారీ వడగండ్ల వర్షానికి ధ్వంసమైన పంటలను, ఇండ్లను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో భారీ వడగండ్ల వర్షం కురిసిందన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పంటలు ధ్వంసంమయ్యాయని, ఇండ్లు కూలిపోయి భారీగా ఆస్తి నష్టం జరిగిందన్నారు. – బాధితులు, రైతులెవరూ ఆందోళన పడవద్దన్నారు. నష్టపోయిన ప్రతి రైతును, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాల్సిందిగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అన్ని మండలాల్లో జరిగిన పంట నష్టాన్ని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, సంబంధితాదికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించి, పరిశీలించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement