Friday, March 29, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. మొక్క‌లు నాటిన ఎంపీ జోగినిప‌ల్లి సంతోష్ కుమార్‌

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఎంపీ సంతోష్ కుమార్ ఆదివారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని మల్లికార్జున స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఆలయ ప్రాంగణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరురి రమేష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement