Friday, April 26, 2024

రైతులెవరూ అధైర్య పడొద్దు..అండగా ఉంటాం.. ఎమ్మెల్యే నన్నపునేని

రైతులెవ‌రూ అధైర్య పడొద్ద‌ని, అండ‌గా ఉంటామ‌ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిన్నరాత్రి కురిసిన భారీ వడగండ్ల వర్షానికి ధ్వంసమైన పంటలను క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పర్యవేక్షించారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించి, చేతికందిన పంట అకాల వర్షం కారణంగా నష్టం వాటిల్లడంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బాధిత రైతులెవ‌రూ ఆందోళన పడవద్దని, జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాల్సిందిగా అధికారులకు ఎమ్మెల్యే నరేందర్ ఆదేశించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొనిపోయి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు బైరబోయిన ఉమ దామోదర్, భోగి సువర్ణ సురేష్, మాజీ కార్పొరేటర్ బిళ్ళ శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, సంబంధిత అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement