Friday, March 29, 2024

రైతులు అధైర్యపడొద్దు… ప్రభుత్వం అండగా ఉంటుంది : చల్లా ధర్మారెడ్డి

వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగేమ్ మండలం వంజరపల్లి, పల్లారుగూడ గ్రామాలలో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి తోటలను సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం ఉదయం పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని, నివేదిక రాగానే పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతుబంధు, సొసైటీ చైర్మన్లు & కమిటీ సభ్యులు, బి.ఆర్.ఎస్. నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement