Tuesday, March 26, 2024

టీలో ఎండ్రీన్ – మ‌హిళ మృతి..

జ‌న‌గామ : బ‌చ్చ‌న్న‌పేట మండ‌లం రామ‌చంద్రాపురంలో విషాదం నెల‌కొంది. విషం క‌లిసిన టీ తాగి మ‌హిళ మృతి చెంద‌గా, మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. కాగా, ఇంటి య‌జ‌మానురాలు అంజ‌మ్మ నేటి ఉద‌యం టీ త‌యారు చేస్తున్న సంద‌ర్భంగా.. ఎండ్రిన్ గుళిక‌ల‌ను టీ పోడిగా భావించి అందులో వేసింది. ఆ టీ సేవించిన కాసేప‌టికే అంజ‌మ్మ ప్రాణాలు కోల్పోగా, ఆమె భ‌ర్త మ‌ల్ల‌య్య‌‌, మ‌రిది భిక్ష‌ప‌తి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement