Friday, April 19, 2024

నిర్బంధంలో విద్యుత్ అధికారులు…

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండైలుపల్లి గ్రామంలో విద్యుత్ అధికారులను నిర్బంధించారు. అవసరాల నిమిత్తం 24 గంటలు విద్యుత్ ఇవ్వకుండా మోసం చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చే విద్యుత్ అయిన సరిగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. విద్యుత్ అధికారులు ఇలా చేయటం మూలంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అవసరాల నిమిత్తం సరిగా కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి 24 గంటల కరెంట్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement