Thursday, April 25, 2024

గాలి వార్త‌లు న‌మ్మొద్దు, అవాస్తవాల‌ను స్ప్రెడ్ చేస్తే చర్యలుంట‌య్‌.. పోలీసుల హెచ్చ‌రిక‌

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో ఓ వ్యక్తిని మర్డర్ చేసేందుకు ఆంధ్ర నుండి సుపారి గ్యాంగ్ వచ్చినట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌ స్ర్పెడ్ అవుతోంది. శాంతి నగర్ ప్రాంతంలో ఈ గ్యాంగ్‌ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్లు ఓ వార్త వైరల్ గా మారింది. ఈ విషయంపై సీఐ పులి రమేష్ గౌడ్ స్పందించారు. వైరల్ అవుతున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు.

అస్తి తగాదాలో ఇద్దరు అన్న చెల్లెళ్ల‌ మధ్య గొడవ జరిగినట్లు, ఇరువురు దరఖాస్తులు స్వీకరించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అవాస్తవమైన వార్తలను వైరల్ చేసి, ప్రజలను భయాందోళనకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement