Friday, April 26, 2024

ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో మ‌హిళ మృత‌దేహం ల‌భ్యం

వరంగల్ : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం సూర్యాపేట తండా గ్రామ సమీపంలో ఎస్.ఆర్.ఎస్.పి కెనాల్ లో మహిళ మృతదేహం లభ్యమైంది. కెనాల్ లో మహిళ మృతదేహం కొట్టుకు వస్తుండడంతో పొలాల దగ్గరకు వెళ్లిన రైతులు గమనించి కట్టెకు తాడు సహాయంతో బయటకు తీసే ప్రయత్నం చేశారు. గుర్తు తెలియని మహిళను ఎవరైనా కాకతీయ కెనాల్ లోకి తోసి హత్య చేసి ఉంటారా? లేక ప్రమాదవశాత్తు జారి కాల్వలో పడి మృతి చెందిందా? లేక మహిళనే సూసైడ్ చేసుకొందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. అసలు మహిళ ఎవ‌రు, ఏ ప్రాంతానికి చెందిన వారో… ఇంకా గుర్తించలేదు. కాకతీయ కెనాల్ ప్రవహించే ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ మహిళ కేసు ఉందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకొనే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఎవ‌రు, ఎందుకు కెనాల్ లో పడ్డారో అనే విషయంపై క్లారిటీ లేదు. వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement