Saturday, April 20, 2024

పుట్టుకతో వచ్చిన దంతం.. తొలగించిన వైద్యులు..

నర్సంపేట, (ప్రభ న్యూస్‌): పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం రాత్రి ఓటాయి గ్రామానికి చెందిన దివ్య అనే మహిళ ప్రసవించగా మగ శిశువు జన్మించాడు.జన్మించిన శిశువుకు పుట్టు కతోనే దంతం కలిగి ఉండటం, ఆ దంతం వదులుగా ఉండటం కారణంగా శిశువు కడుపులోకి వెళ్ళే ప్రమాదం ఉండొచ్చని గమనించిన పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ హిమబిందు సూచనతో శిశువు కుటుంబీకులు దంత వైద్యులు భరత్‌ రెడ్డి ని సంప్రదించగా,ప్రమాదం కలిగించే దంతాన్ని తొలగించారు. ఆ దంతం కారణంగా శిశువు తల్లికి సైతం ఒకింత ప్రమాదం అని వైద్యులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement