Wednesday, April 24, 2024

బీహెచ్‌, ఎంఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌.. 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్రంలోని ప్రైవేట్‌ హోమియోపతి కళాశాలలోని యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా బీహెచ్‌, ఎంఎస్‌ సీట్లను భర్తీ చేస్తారు. 22వతేది నుండి 28వ తేది సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. నీట్‌ 2021 అర్హత సాధించిన విద్యార్దులు ఈ సీట్లకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత యూనివర్సిటీ వాటిని పరిశీలించి ఆప్షన్ల నమోదుకు మరో నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement