Thursday, April 25, 2024

Breaking: విద్యార్థినుల మధ్య ఘర్షణ.. ఐదురుగు ఆత్మహత్యాయత్నం..

విద్యార్థినుల మధ్య ఘర్షణ జరగడంతో ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆరెపల్లిలో బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో విద్యార్థినుల మధ్య ఘర్షణ జరిగింది. మనస్తాపంతో ఐదుగురు విద్యార్థినులు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఐదుగురు విద్యార్థినులు వరంగల్ లోని ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement