Wednesday, April 24, 2024

వ‌ర‌ద‌లో ప‌శువుల కాప‌రి గ‌ల్లంతు.. అధికారుల‌ను అల‌ర్ట్ చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి..

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కంటయ పాలెం గ్రామంలో పశువుల కాపరి పల్లె యాకయ్య గౌడ్ పెద్ద చెరువు మత్తడి వరదలో గేదెతో కలిసి కొట్టుకుపోయాడు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులను ఓదార్చారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి గల్లంతయిన యాకయ్యను బయటికి తీయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement