Thursday, April 18, 2024

ఎన్నిక‌లు ఏదైనా టి ఆర్ ఎస్ దే గెలుపు – రాష్ట్ర హస్తకళల అభివృద్దిసంస్థ చైర్మన్‌ బొల్లం సంపత్‌ కుమార్‌

వరంగల్‌, ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని రాష్ట్ర హస్తకళల అభివృద్దిసంస్థ చైర్మన్‌ బొల్లం సంపత్‌ కుమార్‌ అన్నారు. వ‌రంగ‌ల్ లోని 13వ డివిజన్‌ ఎల్బీ నగర్‌, ఎస్సీకాలనీ , చెరువు కట్ట, దేవునూరి వీధిబోట్లవాడలో ప్రచారం నిర్వహిస్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురేష్‌ జోషిని భారీ మెజారిటీతో గెలిపించాలని బొల్లం సంపత్‌ కుమార్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను బడుగు బలహీన వర్గాల వారికి అందజేస్తున్నారని అన్నారు. గతంలో సురేష్‌ జోషి సతీమణి కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో డివిజన్‌ను ఎంతగానో అభివృద్ధి చేసిం దని, మరొక్కమారు అవకాశం కల్పించి భారీ మెజారిటీతో గెలి పించాలని బొల్లం సంపత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో టీఆర్‌ఎస్‌ కార్య కర్తలు, మహిళా సంఘా ల సభ్యులు భారీగా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement