Tuesday, April 16, 2024

రేగొండలో దారుణం… వ్యక్తి నాలుక కోసిన దుండగులు..?

రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం మడతపల్లి (కాకర్లపల్లి) లో గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి పై దాడి చేసి నాలుక కోసి పరారైన దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
రేగొండ మండలం మడతపల్లికి చెందిన గంధం ఓదేలు అనే వ్యక్తి మంగళవారం రాత్రి తాగునీరు తెచ్చేందుకు కోటంచ గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్ కు వెళ్ళాడు. నీరు తీసుకుని తిరిగి వస్తున్న క్రమంలో మాస్కులు ధరించిన న‌లుగురు గుర్తు తెలియని దుండగులు ఓదేలుపై దాడి చేసి.. నాలుక కోసి అక్కడి నుండి పరారయ్యారు.

తీవ్రంగా గాయపడ్డ ఓదెలు పరిస్థితి విషమంగా ఉండటంతో గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే 108 కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘట‌న స్థలాన్ని పరిశీలించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడికి గల కారణాలు తెలియరాలేదు. ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకోవడంతో జయశంకర్ జిల్లావ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement