Friday, April 26, 2024

భూపాలపల్లి జిల్లాల్లో దారుణం : వృద్ధుడి ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆసుపత్రిలో బిల్లులు చెల్లించలేని స్థితిలో ఓ వృద్ధుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మహబూబ్ పల్లి గ్రామానికి చెందిన మూటికె బాబు (50) చెల్పూర్ కేటిపిపి లో తన భూమి కోల్పోయాడు. భూ నిర్వాసితుడైన మూటికె బాబు కుమారుడికి ఉద్యోగం కోసం కేటిపిపి అధికారుల చుట్టూ తిరిగినా.. నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ పట్టించుకోక పోవడంతో ఈనెల 1వ తేదీన కేటిపిపి ప్రధాన గేటు ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. మూటికె బాబును జెన్కో సెక్యూరిటీ సిబ్బంది భూపాలపల్లిలోని స్మార్ట్ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. 10 రోజులుగా చికిత్స అందించిన భూపాలపల్లి శివారులోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు రూ. 60 వేలు బిల్లు అయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బిల్లుకట్టేందుకు ఎవ్వరు రాకపోవడంతో మనస్తాపం చెంది గురువారం ఉదయం ఆస్పత్రిలో ఉరి వేసుకొని మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement