Saturday, April 20, 2024

మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్

వరంగల్ జిల్లాలోని వెంకటాపురం మండలం కొండాపురం వద్ద మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సానుభూతి పరులను వెంకటాపురం సర్కిల్ సీఐ శివప్రసాద్ ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి నుంచి మావోయిస్టు పార్టీ జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న అమరవీరుల వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తాటి కొమరయ్య, తాటి సత్యం, యాలం సురేష్ లు 2018 నుంచి మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారని శివప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన వారు ఎవరూ మావోయిస్టులకు సహకరించవద్దని సీఐ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement