Saturday, April 20, 2024

11మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ .. బైక్ లు, సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం

గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని పెద్దమ్మ కుంట సమీపంలో మంగళవారం రాత్రి అందిన‌ సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడులు నిర్వహించి, పేకాట ఆడుతున్న 11మందినీ పట్టుకొని, వారిపై కేసులు నమోదు చేసినట్టు చిట్యాల సిఐ పులి వెంకట్ తెలిపారు. 9 సెల్ ఫోన్లు, 7 మోటార్ సైకిళ్లు, రూ.30,460లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. వీరిలో మండల కేంద్రానికి చెందిన పల్నాటి రాజు, పెండ్యాల తిరుపతి, బొడిగె శివ, ఆరుముళ్ళ ప్రభాకర్, ఉడుత దేవేందర్, నూనేగంటి రజనీకాంత్, పోషణ శంకర్, వాంకుడోతు సతీష్, మచ్చిక రక్షిత్, షేక్ ఆరిఫ్, బండి శీనులు ఉన్నట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించినట్లు దృష్టికి వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని వారు కోరారు. చాకచక్యంగా పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి 11 మందిని పట్టుకున్న ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పోలీసు సిబ్బందిని సిఐ వెంకట్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement