Thursday, April 25, 2024

కార్యకర్తలను కాపాడుకుంటాం.. అండగా ప్రమాద బీమా : టీఆర్ ఎస్ ఎమెల్యే ఆరూరి రమేష్..

వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ టేకులగూడెం గ్రామానికి చెందిన ఫరూక్ బాబా ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం కలిగి ఉండడంతో పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్వయంగా ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా పార్టీ క్రియాశీల సభ్యత్వం ద్వారా 2లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందచేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్ కు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు.

అనంతరం అదే గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 60వేల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు ఎమ్మెల్యే. పలువురు టీఆరెఎస్ పార్టీ కార్యకర్తలు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవాల రాధికారెడ్డి, ఇండ్ల నాగేశ్వర్ రావు, పోలేపల్లి రామ్మూర్తి, శేఖర్, ప్రశాంత్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement