Tuesday, April 16, 2024

కెటిఆర్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు ఎబివిపి సెగ‌…

వ‌రంగ‌ల్ – మంత్రి కెటిఆర్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు ఎబివిపి ఆందోళ‌న సెగ త‌గిలింది.. న‌గ‌రంలోని వివిధ అభివృద్ది ప‌నుల‌కు శ్రీకారం చుట్టేందుకు ఇక్క‌డ‌కు వ‌చ్చిన కెటిఆర్ కాన్వాయ్ ను ఎబివిపి విద్యార్ధులు అడ్డుకున్నారు.. జాబ్స్ నోటిపికేష‌న్ వెంట‌నే ఇవ్వాల‌ని, నిరుద్యోగ భృతిని ప్ర‌క‌టించాల‌ని కోరుతూ కొంద‌రు ఎబివిపి కార్య‌క‌ర్త‌లు కాన్వాయ్ ప్ర‌యాణించే రోడ్డుకు అడ్డంగా ప‌డుకున్నారు.. ఒక కార్య‌కర్త పోలీస్ రోప్ పార్టీని ఛ్చేదించుకుని కాన్వాయ్ వ‌ద్ద‌కు దూసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతోఅప్ర‌మ‌త్త‌మైన పోలీసులు వారిని అక్క‌డ నుంచి చెద‌ర‌గొట్టి పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు..ఈ సంద‌ర్భంగా కాన్వాయ్ అయిదు నిమిషాలు అక్కడే నిలిచిపోయింది… అనంత‌రం కెటిఆర్ అక్క‌డి నుంచి ప‌లు కార్య‌క్ర‌మాలలో పాల్గొనేందుకు బ‌య‌లుదేరి వెళ్లారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement