Thursday, April 25, 2024

దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి… చెరువులో ప‌డి యువకుడు మృతి

దుర్గాదేవి నిమ‌జ్జ‌నంలో అప‌శృతి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ చెరువులో పడి శ్రీకాంత్ అనే యువకుడు మృతి చెందాడు. చెరువులో ప‌డిన యువ‌కుడిని కాపాడే ప్రయత్నం చేసినా.. అప్పటికే నీటలో మునిగిపోయాడు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. పండుగ రోజు శ్రీకాంత్ మృతిచెంద‌డంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సాగర్ వద్దకు చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement