Saturday, April 20, 2024

పశువులను మేపేందుకు వెళ్లి.. వాగులో గల్లంతు

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని తిమ్మరాయినిపహాడ్ గ్రామానికి చెందిన పుట్టి ఇన్నయ్య (55) తనకున్న పశువులను మేపడానికి ఈరోజు ఉదయం 10:30 సమయాన గ్రామ శివారులో గల పాఖాలా వాగు దగ్గరికి తీసుకెళ్లగా ఒక్కసారిగా పశువులు వాగు దాటడంతో వాటి కోసం వెళ్తున్న క్రమంలో ఇన్నయ్య వాగులో మునిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న చెన్నారావుపేట పోలీసులు ఇన్నయ్య కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇన్నయ్య కు భార్య నీలిమ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇన్నయ్య ఆచూకీ తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement