Friday, April 26, 2024

ఆటో బోల్తా.. ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు..

తాడువాయి : ములుగు జిల్లాలోని నార్లాపూర్ గ్రామంలో రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. గోవిందరావుపేట మండలం ముద్దులగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు మేడారంలో వరి నాటు వేయడం కోసం వెళ్తున్న క్రమంలో ఆటో వేగంగా నడపడంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముద్దుల గూడెం గ్రామానికి చెందిన మల్లె బోయిన సుజాత అక్కడికక్కడే మృతి చెందగా బుగ్గమ్మ, మల్లమ్మ, పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్ లో ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement