Tuesday, April 23, 2024

అభివృద్ధిలో వ‌ర్ద‌న్న‌పేట‌ను అగ్ర‌భాగాన నిల‌ప‌డ‌మే ల‌క్ష్యం : ఎమ్మెల్యే అలూరి ర‌మేష్‌

ఏ ప్రభుత్వంలో జరగని అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరుగుతుందని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ వడ్డేపల్లి చర్చి నుండి ఉనికిచర్ల వెళ్లే రోడ్డులో రూ.6.80కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్దన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్ర భాగాన నిలపడమే లక్ష్యమన్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో రాజీ పడే సమస్యే లేదని స్పష్టం చేశారు. ఎన్నోఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అనేక పనులను టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, డివిజన్ ప్రెసిడెంట్ రుద్రోజు మనింద్రనాథ్, బల్దియా అధికారులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement