Thursday, April 25, 2024

అంబేద్కర్ కు ఘన నివాళుల‌ర్పించిన మంత్రి ఎర్రబెల్లి..‌

వ‌రంగ‌ల్ – హ‌న్మ‌కొండ లోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలోగ‌ల రాజ్యాంగ ర‌చ‌యిత అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల మాల వేసి, పుష్పాంజ‌లి ఘ‌టించారు ‌రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర రావు. మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, ఎమ్మెల్యేలు చ‌ల్లా ధర్మారెడ్డి, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మొన్నన్నే మంత్రి కేటీఆర్ ప్రారంభించిన అంబేద్కర్ చౌరస్తా పార్క్ ని మంత్రి ఎర్రబెల్లి, కడియం, ఎమ్మెల్యేలు పరిశీలించారు. పార్క్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం పుస్తక ప్రతిమ ను పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement