Thursday, April 25, 2024

రూల్స్ ప‌ట్టించుకోని వీఐపీ ఖైదీలు.. చంచల్‌గూడ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన డీజీ జితేంద్ర

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆర్థిక నేరాల అభియోగాలతో జైలులో ఉన్న వీఐపీ ఖైదీలు కొంత మంది జైళ్ల‌ శాఖ రూల్స్‌ని ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జైళ్ల‌ శాఖ సిబ్బంది కూడా వీఐపీ ఖైదీలతో కుమ్మక్కయ్యార‌నే అప‌వాదు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ శాఖ డీజీ జితేంద్ర శుక్రవారం ఆకస్మికంగా చంచల్‌గూడ జైలును తనిఖీ చేశారు. వీఐపీ ఖైదీలున్న బ్యారక్‌లతో పాటు వారికి కలిపిస్తున్న సౌకర్యాలు తదితర వాటిని పరిశీలించారు. అక్కడున్న మరికొంత మంది ఖైదీలతో మాట్లాడి వీఐపీ ఖైదీల ప్రవర్తన, వారి దినచర్య తదితర అంశాల‌ను అడిగి తెలుసుకున్నారు. జైలు అధికారులతో పాటు సిబ్బందిని కూడా ఈ సందర్భంగా జితేంద్ర మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement