Saturday, April 20, 2024

విద్యుత్ ప్రమాదానికి గురైన యువకులను పరామ‌ర్శించిన విక్ర‌మ్ రెడ్డి

నిజాంపేట్ అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ కు గురైన ఇద్దరు యువకులను బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి హోలిస్టిక్ హాస్పిటల్ లో పరామర్శించి, ప్రమాదానికి గురైన వారితో, వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఓదార్చారు. అంతేకాకుండా కొంత సహకారం చేయడం జరిగింది. భవిష్యత్తులో ప్రమాదానికి గురైనవారికి కాళ్లు, చేతులు స్వర్ణ భారతి ట్రస్ట్ కానీ లేదా భారత్ వికాస్ పరిషత్ ద్వారా కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు. వారి చదువుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తామ‌న్నారు.

వారి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రామచంద్రనాయక్, రాష్ట్ర ఎస్సీ సెల్ స్కాలర్ షిప్ కన్వీనర్ నాగరాజు, బీజేపీ నిజాంపేట్ ఉపాధ్యక్షులు కాసాని నరసింహ, బీజేపీ నాయకులు సుమన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement