Thursday, March 28, 2024

ముస్తాబైన వికారాబాద్ రైల్వే స్టేషన్

వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో ప్రముఖ రైల్వే స్టేషన్ అయిన వికారాబాద్ జంక్షన్ సర్వాంగ సుందరంగా సిద్ధపడుతుంది. ప్రస్తుతం ఇక్కడి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు, ప్రధానంగా హైదరాబాద్ బొంబాయి బుల్లెట్ ట్రైన్ నేపథ్యంలో ఈ నెల 25న దక్షిణ మధ్య రైల్వే అధికారులు వికారాబాద్ విచ్చేయనున్నారు. దీనికోసం రైల్వే స్టేషన్ ముందు జాతీయ పతాకాన్ని పెద్ద ఎత్తున ఎగరవేయ‌డంతో పాటు రైల్వే స్టేషన్ ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రజలకు ఈ బులెట్ ట్రైన్ గురించి వివరించడంతో పాటు సంబంధిత ప్రాంతాల నుండి అభిప్రాయాలు సేకరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement