Thursday, April 25, 2024

ఎంఐఎం అధినేతపై విజయశాంతి సెటైర్

దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉందంటూ ప్రధాని మోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన విమర్శలకు బీజేపీ నాయకురాలు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. ‘‘కోవిడ్ వ్యాక్సిన్ కొరత 135 కోట్ల పైన జనాభా ఉన్నప్పుడు సహజం ఒవైసీ జీ, ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. 2020 జూలైలో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్‌కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..? ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గార్కి చెప్పలేదా..? 25 శాతం ప్రైవేటు హాస్పిటల్స్‌కి ఇవ్వటం వీఐపీ కల్చర్ అయితే… టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి  వ్యాక్సిన్ కొనుగోలు ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా..? ఒవైసీ గారు’’ విజయశాంతి ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement