Wednesday, April 17, 2024

ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు మోడీ – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి


ఉమ్మడి నిజామాబాద్ ప్రభన్యూస్ బ్యూరో: దేశంలోనే అతి పెద్ద దొంగ ప్రధాని నరేంద్ర మోడీ అని, ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడని రాష్ట్ర రోడ్లు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటైన విమర్శ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో మంగళవారం పాల్గొని ప్రసంగించారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మంత్రి కేటీఆర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. ప్రతి దానిపై అబద్దాలు ఆడుతూ బురద జల్లుతున్నారు. బండి సంజయ్, అరవింద్ ఎమ్మెల్సీ కవిత పై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారు. కవితకు సంబంధం లేని కేసులో ఇరికించి ఆమెను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. దేశంలో అసలు దొంగ ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలో బడా కంపెనీలు లోన్లు తీసుకుంటాయి. అలా తీదుకున్న వారి రూ. 12 లక్షల కోట్లు మాఫీ చేశాడు మోడీ. కేసీఆర్ ఎందుకు మాఫీ చేశావని అడిగితే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఫ్రెండ్ ఆదాని, ఒకప్పుడు అతని ఆస్తి రూ. 50 వేల కోట్లు. ఇప్పుడు రూ. 12 లక్షల కోట్లు. ఎల్ ఐ సి కి రూ.60 వేల కోట్లు నష్టం వచ్చిoది. ఈ డబ్బులు మోడీ అదాని కంపెనీలో పెట్టాడు. ఎల్ ఐ సి, బ్యాంకు నష్టపోతే ప్రజలు నష్టపోయినట్లే…. ఇది అన్యాయాన్ని కేసీఆర్ అడిగితే కవితపై కేసుల్లో ఇరికిస్తున్నారు. రూ. లక్ష 50 వేల కోట్లు కాజేసిన అదానిపై చర్యలు తీసుకోరేందుకు అని ప్రశ్నించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. పేపర్ లీక్ విషయంలో అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు మంత్రి వేముల. నరేంద్ర మోడీ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని అన్నారు.

“నరేంద్ర మోడీ పాలనలో రూపాయి విలువ పతనమైంది. సిలిండర్ ధర రూ. 400 నుంచి రూ.1200 పెరిగింది. పప్పు, అప్పుల ధరలు పెరిగిపోయాయి. డీజిల్ ధర రూ. 40 నుంచి రూ. 100 అయ్యింది. దీంతో ట్రాన్స్ పోర్ట్ ధర పెరిగి నిత్యావసర సరుకుల మీద ప్రభావం చూపుతోంది. సామాన్యుల మీద ధరలు పెరగడం పెను భారంగా మారింది. దీనంతటికి కారణం ప్రధాని మోడీ. తెలంగాణలో ఓ వైపు కేసీఆర్ పేద ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే…. నరేంద్ర మోడీ ధరలు పెంచి సామాన్యులను లూటీ చేస్తున్నారని అన్నారు మంత్రి. ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు నరేంద్ర మోడీ. బడా బాబుల కంపెనీలకు రుణాలు మాఫీ చేసి పేదల డబ్బులు కాచుకుంటున్నారు. ఆ డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నారు. అలా తెలంగాణలో 4 గురు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి దొరికి పోయారు. వాళ్ళ అవినీతి గురించి మాట్లాడితే…. కేసులు పెడుతున్నారు. రాహుల్ గాంధీ మీద అనవసరంగా… కేసులు పెట్టారు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఇలా 6 గురు మోడీలు డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు. రాహుల్ గాంధీ అన్న మాట ఏంటంటే మోడీ పేరుతో ఉన్న గుజరాత్ కు చెందిన 6 గురు అని అంటేనే ఆయన్ను ఎంపీ గా డిస్ క్వాలిఫై చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరగలేదు. ఎమర్జెన్సీ కంటే చాలా అన్యాయం జరుగుతోంది. దర్యాప్తు సంస్థలు వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయి. బాల్కొండ నియోజక వర్గ ప్రజల ఆశిష్షులతోనే ఇవాళ నేను ఇలా ఉన్నాను. కేసీఆర్ తో నాకున్న సాన్నిహిత్యం వల్ల ఆయన దయతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గ్రామాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోంది. డోన్ పాల్ అనే గ్రామంలో 300 ఇల్లు ఉంటే 316 మందికి పెన్షన్లు, రైతు బంధు కింద 375 మందికి రైతు బంధు ఇలా ఏ చిన్న గ్రామాన్ని వదలకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ప్రజలు అండగా ఉండాలని అడిగే హక్కు కేసీఆర్ కు అక్కడికే ఉంది” అని ప్రశాంత్ అన్నారు..

“అభివృద్ధి చూసి ఓర్వలేక ఎంపీ అరవింద్ లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు . నీ ఇంట్లోనే రెండు పార్టీలు ఉన్నాయి. పెద్ద కొడుకు, చిన్న కొడుకు రాజకీయాలు అనారోగ్యంగా ఉన్న తండ్రిని ఇబ్బంది పెడుతున్నారు. డీఎస్ కాంగ్రెస్ లో చేరలేదని భార్య ఒక వైపు లేఖ రాసింది. కాంగ్రెస్ లో చేరాదని పెద్ద కొడుకు, చేరలేదని చిన్న కొడుకు. 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండు పేపర్ రాసిచ్చి 5 ఏళ్ల వుతున్నా…. పసుపు బోర్డు లేదు. బాండు పేపర్ విలువను కూడా తగ్గించాడు అరవింద్. ఎంపీగా అరవింద్ జిల్లాకు ఏం చేశాడు అని అడిగితే…. సమాధానం చెప్పకుండా బూతులు తిడుతున్నాడు. ఎంపీ అరవింద్ వల్ల ఇంట్లో తల్లి దండ్రులకు మనశ్శాంతి లేదు. పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి లేద”ని అన్నారు మంత్రి వేముల. .

ఆత్మీయ సమ్మేళనంలో మహిళల ఆనంద బాష్పయాలు

- Advertisement -

మంత్రి వేముల పాల్గొన్న మహిళా సమ్మేళనంలో మోర్తాడ్ మండలంలోని 10 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కొందరు మహిళలు మాట్లాడుతూ తమ గ్రామంలో జరిగిన అభివృద్ధి బాగుందని తమకు సంక్షేమ పథకాలు సంతోషాన్నిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement