Thursday, April 25, 2024

తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాల‌యంలో.. ఘ‌నంగా వాజ్ పేయి జ‌యంతి వేడుక‌లు

తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాల‌యంలో వాజ్ పేయి జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. కాగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా వాజ్ పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు బిజేపి నేత‌లు. వాజ్ పేయి జయంతిని గుడ్ గవర్నెన్స్ డే గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కమలనాధులు పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే చింతల తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన జరగాలని అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement