Thursday, April 25, 2024

పేద యువ‌తుల‌ పెళ్లిళ్లకు అండగా ఉప్పల ఫౌండేషన్.. పుస్తె మెట్టెలు, గాజులు కానుక‌గా అంద‌జేత‌

నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన ముగ్గురు అమ్మాయిల పెళ్లిళ్లకు ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళసూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అంద‌జేశారు. హైదరాబాద్ లోని ఉప్పల్ కి చెందిన ఎర్ర సబిత దుర్గదాస్ కూతురు.. స్వర్ణలత, హయత్ నగర్ కి చెందిన తండ్రిలేని నిరుపేద ఏదుల్ల నర్సింహ- రమాదేవి, బాలమణి కూతురు శివరాణి, సిద్దిపేట జిల్లా తోగుట గ్రామానికి చెందిన మాదస్ బాలకృష్ణ- సత్తవ్వ కూతురు రేవతి (సంధ్య) వివాహం కోసం అండ‌గా నిలిచింది ఉప్ప‌ల ఫౌండేష‌న్‌.

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా ఇవ్వాల మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అంద‌జేశారు. కార్యక్రమంలో పెళ్లి కూతుర్లు ముగ్గురు, వారి తల్లిదండ్రులు, తొగుట సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ కుమార్, నెమ్మాది శ్రావణ్ కుమార్ టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు శివ కృష్ణ, ప్రవీణ్ కుమార్, ఏదుల్ల యాదగిరి తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement