Thursday, April 25, 2024

నెగ్గిన అవిశ్వాస తీర్మానం-పదవి నుండి త‌ప్పుకున్న‌ ఉపసర్పంచ్ శిరీష్ గౌడ్

దోమకొండ, ప్రభన్యూస్…కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట ఉప సర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీoతో ముత్యంపేట ఉపసర్పంచ్ ముత్తగౌని శిరీష్ గౌడ్ తన పదవిని కోల్పోయారు. కామారెడ్డి ఆర్ డి ఓ శ్రీను అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ జరిపారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఏడు ఓట్లు ..వ్యతిరేకంగా ఆరు ఓట్లు రావడంతో వార్డు సభ్యులు.. సర్పంచ్ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ముత్యంపేట సర్పంచ్ సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశాడని ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్ పై గ్రామస్తుల సహకారంతో వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టారు.

వార్డు సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై కామారెడ్డి .. ఆర్ డి ఓ శ్రీను ఈరోజు ప్రత్యేక సమావేశం గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటు చేసి ఓటింగ్ జరిపారు. ఉప సర్పంచ్ పై అవిశ్వాస తీర్మానంలో సగానికి అంటే ఎక్కువ వార్డు సభ్యులు అవిశ్వాసంకు అనుకూలంగా ఓటు వేయడంతో ఉపసర్పంచ్ ముత్తగోని శిరీష్ గౌడ్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానం నెగ్గాక విలేకరులతో సర్పంచ్ వార్డు సభ్యులు మాట్లాడారు. మాజీ ఉపసర్పంచ్ శిరీష్ గౌడ్ ప్రభుత్వ స్కూలు స్థలాన్ని 1200 గజాల స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయడంతో గ్రామస్తుల సహకారంతో వార్డు సభ్యులు అవిశ్వాసం పెట్టారని తెలిపారు. గ్రామస్తులందరి సహకారం వార్డు సభ్యుల ఓటింగ్ తో ఉప సర్పంచ్ పై అవిశ్వాసం నెగ్గిందని ఇది ముత్యంపేట గ్రామ ప్రజల విజయమని సర్పంచ్ సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement