Thursday, April 25, 2024

అమిత్ షా కాన్వాయ్ కి అడ్డొచ్చిన గుర్తు తెలియ‌ని వాహ‌నం-బ్యాక్ అద్దం ప‌గ‌ల‌గొట్టిన భ‌ద్ర‌త సిబ్బంది

కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం వేడుక‌లు అట్ట‌హాసంగా ప్రారంభ‌మ‌య్యాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ వేడుక‌లు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి.. హరితా ప్లాజాకు చేరుకున్నారు హోం మంత్రి అమిత్ షా.ఈ నేపథ్యంలోనే.. హరిత ప్లాజా వద్ద అమిత్ షా కాన్వాయ్ కి అడ్డొచ్చింది ఓ గుర్తు తెలియని వ్యక్తి కారు. అమిత్‌ షా కాన్వాయ్‌ వచ్చినా… అతను కారు పక్కకి తీయకపోవడంతో.. బ్యాక్ అద్దం పగలగొట్టింది అమిత్ షా భద్రత సిబ్బంది. అయితే.. ఆ వ్యక్తి ఎందుకు అలా చేశాడో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం హరిత ప్లాజా లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement