Thursday, April 18, 2024

రేపు రామగుండం రానున్న‌ కేంద్ర మంత్రి.. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌నా ఏర్ప‌ట్ల‌పై పర్యవేక్షణ

ఎన్టీపీసీ, (ప్రభ న్యూస్) : ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్ ఖూబా రామ‌గుండం రానున్నారు. ప్రధాని పర్యటన రూట్ మ్యాప్, ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన ప‌లు విషయాలపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్ప‌టికే ఈ ప్రాంతంలో పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement